ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి *(బంటి) మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి పాదయ

Published: Monday January 23, 2023

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి  ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కొరకు , ప్రజల సమస్యలు బాగుకోసం  నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి సాధకబాధకాలను తెలుసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను  గ్రామంలోని వివిధ అభివృద్ధి పనులు గుర్తించి వాటిని తెలియజేస్తూ  ప్రజలకు ఉన్నటువంటి వ్యక్తిగత సమస్యలను కూడా గడపగడపని తట్టి తెలుసుకొని ఎమ్మెల్యే  మంచిరెడ్డి కిషన్ రెడ్డి  ద్వారా ప్రభుత్వము నుండి అధిక నిధులు తీసుకువచ్చి మన బతుకులు బాగు చేయడానికి మరో ముందడుగు వేస్తూ ప్రగతి నివేదన పాదయాత్ర చేపట్టడం జరిగింది కావున  యాచారం మండలం  నందివనపర్తి  గ్రామంలో నుండి రేపు అనగా 22 ఆదివారం  ఉదయం 9:30 గంటలకు ప్రారంభం అగుచున్న యాత్రకు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు యువ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను దిగ్విజయంగా ముందుకు సాగడానికి మనమంతా పాలుపంచుకొని ఆశీర్వదించడానికి తరలిరావలసిందిగా కోరుచున్నాము  వ్యవసాయ మార్కెట్  కమిటీ   చైర్మన్ ఏర్పుల చంద్రయ్య ఆయన తెలిపారు,