అయ్యప్ప స్వామి ఆలయంలో ఉదయాస్తమాన పూజలు

Published: Thursday December 01, 2022
మధిర రూరల్ నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి) మధిర పట్టణంలోని అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ స్వామి అయ్యప్ప దేవాలయంలో బుధవారం  జరిగిన ఉదయాస్తమాన పూజల్లో టౌన్ ఎస్ఐ ఎస్ సతీష్ దంపతులు పాల్గొన్నారు. స్వామివారి 15వ మండల పూజల్లో భాగంగా ఆలయంలో ఈ ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. అనంతరం అయ్యప్ప స్వామి భక్తులకు, మాలధారులకు వారు చెడే లక్ష్మీనారాయణ కుమారుడు అర్జున్ దంపతులు అన్నదానం వితరణ  చేశారు. ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ ఎస్ సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని ఆయన అన్నారు. పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతి ఒక్కరూ అన్నదానాలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప మాలదారులకు అన్నదానం ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు ఈ అన్నదాన కార్యక్రమంలో టౌన్ ఎస్ఐ సతీష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు బుధవారం నాడు సాయంత్రం పూట అయ్యప్ప స్వామి దేవాలయంలో పడి పూజా కార్యక్రమం పాల్గొని శివేలు కార్యక్రమంలో పాల్గొని ఎస్సై సతీష్ కుమార్ స్వాములకు మాలదారులకు బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి బత్తుల శ్రీనివాసరావు స్వామి చెరుపల్లి శ్రీధర్ స్వామి మైనీడి జగన్మోహన్ రావు స్వామి పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు దేవి శెట్టి రంగా, గాంధీ స్వాములు అర్చకులు తదితరులు పాల్గొన్నారు.