బండి పార్థసారథిరెడ్డి, దాసురావు స్నేహబంధం

Published: Monday June 20, 2022
తల్లాడ, జూన్ 19 (ప్రజా పాలన న్యూస్):
 *ఒకరు రాజ్యసభ సభ్యులు.. మరొకరు తల్లాడ మండల టిఆర్ఎస్ పార్టీలో కీలక నేత. వారిరువురు చదువుకునే రోజుల్లో మంచి ఫ్రెండ్స్. ఇరువురు ఇప్పటికీ నిత్యం ఫోన్ లో బాగోగులు సంభాషించుకునే వారే. కానీ వారి ఇరువురి కలయిక రానే వచ్చింది. ఒకరు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వచ్చిన బండి పార్థసారథి రెడ్డి కాగా మరొకరు తల్లాడ మండలం లోని కలకొడిమ గ్రామానికి చెందిన టిఆర్ఎస్ జోనల్ చైర్మన్, తల్లాడ జడ్పిటిసి ప్రమీల భర్త దిరిశాల దాసురావు. శనివారం రాత్రి ఖమ్మంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథి రెడ్డిలకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ మండలం నుండి భారీగా ప్రజలు హాజరయ్యారు. తల్లాడ జోనల్ చైర్మన్ దిరిశాల దాసురావు, జడ్పీటీసీ ప్రమీల అభినందన సభకు వెళ్లారు . ఈ సందర్భంగా సభ ముగిసిన తర్వాత ఇరువురు ఫ్రెండ్స్ బండి పార్థసారథి రెడ్డి, దిరిశాల దాసురావు ఒకరినొకరు కలుసుకుని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తమ చిన్ననాటి స్నేహబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా పక్కన ఉన్న ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వారు ఇరువురి స్నేహాన్ని పలకరిస్తూ ఛలోక్తులు వేసుకున్నారు.