రామ్మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం

Published: Monday May 03, 2021
తాలూక అంబేద్కర్ యువజన సంఘాల ఉపాధ్యక్షులు భాస్కర్
పరిగి, మే 2, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా ను జోగులాంబ జోన్ నుంచి చార్మినార్ జోన్లోకి మార్చడానికి ఉద్యమించి సాధించిన సందర్భంగా దోమ మండలం బడెంపల్లీ గ్రామములో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి తాలూక అంబేద్కర్ యువజన సంఘాల ఉపాధ్యక్షులు భాస్కర్ ఆధ్వర్యంలో వివేకనంద యువజన సంఘం నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రామ్మోహన్ రెడ్డి చిత్రపటానికి  పాలాభిషేకంచేయడం జరిగింది.అనంతరం  బడెంపల్లి గ్రామానికి చెందిన  బొయిని భాగ్యలక్ష్మి అనే విద్యార్థి కి  1500 రూపాయల ఆర్థిక సాయం చేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచలి రాజు, కోమటి వంశీ, సాకలి నందు, బోయిని మొగులయ్య, కావాలి హనుమయ్య, వెంకట్ రాములు, వివేకనంద యువజన సంఘం,  అంబేద్కర్ యువజన సంఘం, అదేవిధంగా తాలూక అంబేద్కర్ యువజన సంఘాల ఉపాధ్యక్షులు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.