రావినూతల గ్రామంలో అన్నదానం నిర్వహించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు

Published: Thursday September 16, 2021
బోనకల్ ప్రజాపాలన ప్రతినిధి 15వ మండల పరిధిలోని రావినూతల గ్రామంలో శివాలయం వీధిలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమాన్ని బోనకల్ మండలం ఎస్ఐబి కొండలరావు, రావినూతల గ్రామం సర్పంచి కొమ్మినేని ఉపేందర్, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమం నిర్వహిచడం వలన భక్తుల్లో దైవచింతన పెరుగుతుందని తద్వారా మనస్సుకు ప్రశాంతత లభిస్తుందని అన్నారు. మరియు గణేష్ మండపాల వద్ద ప్రతి ఒక్కరు నిబంధనలు పాటిస్తూ ప్రభుత్వం విధించిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరు విధిగా పాటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గణపరపు వెంకటేశ్వర్లు, గుర్రం వెంకటేశ్వర్లు గుర్రం శ్రీనివాసరావు సోమనబోయిన జానకిరాములు, సోమనబోయిన త్రివేష్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.