విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

Published: Tuesday August 31, 2021
 శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రొటెం చైర్మన్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎన్  నర్సింగ్ గౌడ్, సంతోష్ గౌడ్, రవీందర్ రెడ్డి, ఎడ్ల రమేష్, చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్, చిత్తారి, బలరాం, నవీన్,  క్రిష్ణయ్య, ప్రకాష్, సుదర్శన్ చారి, శ్యామ్ చారి,  మహేందర్ చారి లు విచ్చేసి అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం సభ్యులు రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి, రవి చారి, సాయన్న చారి, సాయి చారి, శీను చారి, దాసు చారి, దినేష్ చారి, దుర్గా చారి, నిరంజన్ చారి, భూషణం చారి ,ప్రభాకర చారి తదితరులు పాల్గొన్నారు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, కరోనా మహమ్మారి ముప్పు తొలగి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని కంజర్ల కృష్ణ మూర్తి చారి తెలిపారు, అమ్మవారి బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి మహంకాళి విశ్వకర్మ సంఘం సభ్యుల తరఫున సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి శాలువాలతో సన్మానించారు.