ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 284 వి.వి. పాట్ లు గోవాకు తరలింపు ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ **

Published: Thursday December 01, 2022
ఆసిఫాబాద్ జిల్లా నవంబర్ 30 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
 
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 284 వి.వి. పాట్ లను గోవాకు తరలించడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఈ. వి. ఎమ్., వి.వి. పాట్ ల గోదామును జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో తెరిచి భారత ఎన్నికల సంఘం సూచించిన మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులకు 284 వి. వి. పాట్ లను అందించడం జరిగిందని, అనంతరం అధికారులు, ప్రతినిధుల సమక్షంలో తిరిగి తీయడం జరిగిందని తెలిపారు. గోదాము రక్షణకు పూర్తిస్థాయి భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని, సి. సి. కెమెరాలు ఏర్పాటు చేసి ఎల్లప్పుడూ పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ ఆర్.డి.ఓ. రాజేశ్వర్, ఎమ్మార్వో రామ్మోహన్, ఎన్నికల డి.టి. జితేందర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.