రక్త దానం చేసిన దాతలకు పటాన్చేరు సి ఐ ద్వారా ప్రశంస పత్రం అందుచేత

Published: Wednesday August 11, 2021
యండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల ద్వారా పలు హాస్పిటల్లలో చికిత్స పొందుతున్న అత్యవసరమైనవారికి రక్త దానం చేసే వారిని సొంత రవాణా ఖర్చులతో హాస్పిటల్ కు తీసుకువెళ్లి వారికి పేషెంట్లకు రక్త దానం చేస్తున్నామని. రక్త దానం చేసే రక్త దాతలకు ఈరోజు పటన్చేరు సి ఐ వేణుగోపాల్ రెడ్డి  ఆధ్వర్యంలో ప్రశంస పత్రం (సర్టిఫికేట్) అందజేశారని ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. సిఐ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ యువతలో రక్త దానం గురుంచి అవగాహన కలిగి ముందుకు వచ్చి రక్త దానం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ విజయ్, యండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, తదితరులు పాల్గొన్నారు.