అయ్యా మా గోడు వినండి ప్రమాదకరంగా మారిన రేమిడిచర్ల కొత్తపాలెం రోడ్డు

Published: Monday June 21, 2021

మధిర, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : అయ్యా మా గోడు వినండిఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల కొత్తపాలెం ఆర్ అండ్ బి రోడ్డు ప్రమాదకరంగా మారింది. నిత్యము వేలాది వాహనాలు ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. అడుగడుగున గుంటలు ఏర్పడి ప్రయాణం కొనసాగుటకు వీలు లేకుండా పోయింది. విజయవాడ వెళ్ళే వారు ఎక్కువగా ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తుంటారు.అకస్మాత్తుగా ఈ రెండు గ్రామాల ప్రజలు హాస్పిటల్ కి వెళ్ళాలి అన్న ఇబ్బందికరంగా మారింది. వాహనదారులుఇంత ఇబ్బంది పడుతున్నా ఆర్అండ్బి అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి రేమిడిచర్ల కొత్తపాలెం రోడ్డు బాగు చేయాలని రెండు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.