అయ్యా మా గోడు వినండి ప్రమాదకరంగా మారిన రేమిడిచర్ల కొత్తపాలెం రోడ్డు
Published: Monday June 21, 2021
మధిర, జూన్ 20, ప్రజాపాలన ప్రతినిధి : అయ్యా మా గోడు వినండిఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం రేమిడిచర్ల కొత్తపాలెం ఆర్ అండ్ బి రోడ్డు ప్రమాదకరంగా మారింది. నిత్యము వేలాది వాహనాలు ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణాలు కొనసాగిస్తుంటారు. అడుగడుగున గుంటలు ఏర్పడి ప్రయాణం కొనసాగుటకు వీలు లేకుండా పోయింది. విజయవాడ వెళ్ళే వారు ఎక్కువగా ఈ మార్గం గుండా ప్రయాణం చేస్తుంటారు.అకస్మాత్తుగా ఈ రెండు గ్రామాల ప్రజలు హాస్పిటల్ కి వెళ్ళాలి అన్న ఇబ్బందికరంగా మారింది. వాహనదారులుఇంత ఇబ్బంది పడుతున్నా ఆర్అండ్బి అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దయచేసి రేమిడిచర్ల కొత్తపాలెం రోడ్డు బాగు చేయాలని రెండు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు.
Share this on your social network: