19 వార్డులో శానిటేషన్ చేస్తున్న వార్డు కౌన్సిలర్ మాధవి
Published: Tuesday May 18, 2021
మధిర, మే17, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ పరిధిలోని 19 వార్డు బంజారా కాలనీలో బ్లీచింగ్ పౌడర్, మరియు శానిటేషన్ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ ధీరావత్ మాధవి చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధిర లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలెవరూ ఇల్లు వదిలి బయటికి రావొద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని పది నిమిషాలకు ఒకసారి శానిటైజర్ వాడాలని, మాస్కు తప్పనిసరిగా ధరించాలి, కరోనా సోకిన వ్యక్తులు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సింది గా సూచించారు, ఆమె పలు జాగ్రత్తల సూచించారు
Share this on your social network: