క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేత

Published: Monday March 21, 2022

రాయికల్, మార్చి 20 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం లోని తాట్లవాయి గ్రామంలో శ్రీరామ  స్పోర్ట్స్ క్లబ్ వారిచే నిర్వహించబడిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపులో భారతీయ జనతా పార్టీ నాయకుడు న్యాయవాది చిలకమర్రి మదన్మోహన్ రాయికల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు లౌడియా సంధ్యారాణి సురేంద్ర నాయక్ తో కలిసి క్రికెట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాట్ల వాయి గ్రామ సర్పంచ్ సాగరిక శ్రీనివాస్ టోర్నమెంట్ నిర్వాహకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.