తెలంగాణ ఉద్యమకారులు ఏకం కావాలి క్రిష్టపర్
వలిగొండ ప్రజాపాలన ప్రతినిది మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పాలకుల అన్యాయాలకు ఎండగడుతూ పోలీసుల నిర్బంధాన్ని ఎదుర్కొని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులు ఏకమై హక్కుల సాధన కోసం పోరాడాలని తెలంగాణ ఉద్యమకారుల పోరం జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్ పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం కొద్దిమందికే తెలంగాణ ఫలాలు అందుతున్నాయని అందరూ కలలుగన్న బంగారు తెలంగాణ కలగానే మిగిలింది అని ఆయన విమర్శించారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం తృణప్రాయంగా విడిచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి దారుణంగా ఉందని, ఎలాంటి ఆదరణకు నోచుకోక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర సమరయోధులు గా గుర్తించి పెన్షన్లు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమకారుల హక్కులకోసం ఉద్యమకారులంతా ఏకమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
Share this on your social network: