కోవిడ్ ఉన్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Published: Thursday April 22, 2021
మున్సిపల్ చైర్మన్  ముకుంద అశోక్ కుమార్
పరిగి, 21 ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో గల గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టుప్రక్కల మరియు మూడో వార్డు లో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భగా మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ మాట్లాడుతూ  కరోనా విజృంభన వేళ  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకి రాకూడదు అని బయటకు వెళ్ళినప్పుడు మాస్కు ధరించి  భౌతిక  దూరాన్ని పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వేముల కిరణ్ కుమార్, నాయకులు గోపాల్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.