మునుగోడు లో ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయం - కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ నేతలు

Published: Wednesday October 26, 2022
కోరుట్ల, అక్టోబర్ 25 ( ప్రజాపాలన ప్రతినిధి ):
మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని కోరుట్ల నియోజకవర్గం టిఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేశారు.కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరక ఎమ్మెల్యే ఇన్చార్జి గ్రామమైన నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రామంలో కోరుట్ల నియోజకవర్గ టిఆర్ఎస్ అక్టోబర్  8 నుండి ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటా ప్రచారం చేస్తూ మహిళలకు, యువకులకు, రైతులకు  చేనేత కార్మికులకు, ఇతర గ్రామ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను గుర్తుకు చేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పుట్టపాక గ్రామంలో ప్రభాకర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వస్తుందని తెలిపారు నియోజకవర్గంలో తెరాసాను ఆదరిస్తున్న తీరును చూస్తే ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. ఈ ప్రచారంలో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి కూతురు రమ్య, జోగన్ పల్లి సర్పంచ్ దుంపల రాజనర్సయ్య, కోరుట్ల పట్టణ టిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు జాల వినోద్, ఉపాధ్యక్షుడు బలిజ శివప్రసాద్, టిఆర్ఎస్ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు ఫయీం, సీనియర్ యూత్ నాయకులు సనావుద్దీన్, ఫాయిమ్, గుగ్గిల సురేష్ గౌడ్, పిప్పర రాజేష్ తదితరులు పాల్గొన్నారు.