శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిని దర్శించుకున్న జడ్పీ చైర్ పర్సన్ వసంత దంపతులు
Published: Tuesday February 28, 2023
సారంగాపూర్, ఫిబ్రవరి 27 (ప్రజపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ పెంబట్ల కొనాపూర్ శ్రీ దుబ్బరాజేశ్వర స్వామిని జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు. అర్చకులు వారికి స్వాగతం పలికి రుద్రాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి మెమోంటో బహుకరించి షాలువతో ఘనంగా సన్మానించారు. వారివెంట ఎంపీపీ కొల జమునశ్రీనివాస్ ఈవో కాంతారెడ్డి పోరండ్ల శంకరయ్య ఆలయ ధర్మకర్తలు తదితరులు ఉన్నారు.
Share this on your social network: