ఎమ్మెల్సీగా రాములు నాయక్ ను గెలిపించాలి

Published: Wednesday February 24, 2021

వలిగొండ ప్రజాపాలన: ప్రస్తుతం జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాములు నాయక్ ను గెలిపించాలని ఎంపిపి నూతి రమేష్ రాజు అన్నారు. మంగళవారం మండలంలోని గోకారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను కలిసి రాములు నాయక్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాలు ఎండగట్టడానికి రాములు నాయక్ ను గెలిపించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శనిగారపు పాండు, కట్ట లింగస్వామి, యాదయ్య, శ్రీకాంత్, పాండు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.