గద్దల నానిని పరామర్శించిన మల్లాది వాసు
Published: Monday October 25, 2021
రాజకీయాలకు అతీతంగా మల్లాది వాసుకి ఘనస్వాగతం పలికిన కాలనీవాసులు
మధిర అక్టోబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : అనారోగ్యానికి గురైన పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన టిఆర్ఎస్ నాయకులు గద్దల నానిని ఆదివారం టిఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాది వాసు పరామర్శించారు ఈ సందర్భంగా గద్దల నాని ఆరోగ్యపరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ కాలనీకి వెళ్ళిన మల్లాది వాసుకి రాజకీయాలకతీతంగా ఆప్రాంత ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎస్సీ కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మల్లాది వాసు వెంటనే పరిష్కరించేవారని పేరుంది. దీంతో మల్లాది వాసు గద్దల నాని నివాసానికి వచ్చారని తెలుసుకున్న ఆ ప్రాంతవాసులు రాజకీయాలు పక్కనపెట్టి ఘన స్వాగతం పలికారు.
Share this on your social network: