ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో గణనాథుడికి ఘనంగా పూజలు

Published: Friday September 02, 2022
మేడిపల్లి, సెప్టెంబర్1 (ప్రజాపాలన ప్రతినిధి)
వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఉప్పల్ ప్రెస్ క్లబ్ లో నెలకొల్పిన గణనాథుడికి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పాల్గొని గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ, సంతోషాలతో ఉండాలని గణనాధుని వేడుకున్నట్లు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.తిరుపతిరెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు పల్లె మహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఎం. సురేష్ కుమార్, కోశాధికారి ఆర్ యాదగిరి గౌడ్, కార్యనిర్వాహక  కార్యదర్శులు ఎం అశోక్, దాస రాజు, సంయుక్త కార్యదర్శి జి.శివాజీ, సలహాదారులు కె.చంద్రమౌళి, డి.సురేష్, శ్రీశైలం కే. శ్రీనివాస్, కిషోర్, టీఆర్ఎస్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర రెడ్డి, , గుడి మధుసూదన్ రెడ్డి, జల్లి మోహన్, చింతల నరసింహారెడ్డి, ఉప్పల్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు ఆకుల మహేందర్, నిరంజన్ చారి, రామ్ రెడ్డి, అన్య బాలకృష్ణ  తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area