దాడులు తింపికొడతాం.

Published: Monday March 06, 2023
...బిఆర్ ఎస్ నాయకులను హెచ్చరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు.
 
మంచిర్యాల టౌన్, మార్చి 05, ప్రజాపాలన: కాంగ్రెస్ నేతలపై బిఆర్ఎస్ శ్రేణులు దాడులకు పాల్పడితే అదే రీతిలో తిప్పికొట్టి తీరుతామని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు హెచ్చరించారు. ఆదివారం మంచిర్యాల ఐబీ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్, కౌన్సిలర్ సల్ల మహేష్ మాట్లాడుతూ ప్రోటోకాల్ విషయంలో శనివారం రాత్రి జరిగిన గొడవలో తమపై బిఆర్ఎస్ నేతలు దౌర్జన్యపూరితంగా వ్యవహరించారని సంజీవ్ అన్నారు. వార్డు కౌన్సిలర్ అయినప్పటికీ తన చేతిలో ఓటమిపాలైన బిఆర్ఎస్ నాయకునితో కొబ్బరికాయలు కొట్టించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చౌరస్తా విస్తరణ లో భాగంగా శంకుస్థాపన కార్యక్రమం లో ప్రోటోకాల్ విస్మరించారని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు టికెట్ రాదనే ఒత్తిడి లో కాంగ్రెస్ నేతలపై దాడులకు పురిగొల్పుతున్నాడని  వారు ఆరోపించారు. బిఆర్ఎస్ నేతలు తమ పద్ధతులు మార్చుకోకపోతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా వారి పద్ధతిలోనే జవాబు చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.