తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో బ్రెడ్ మజ్జిగ పాకెట్ల పంపిణీ
Published: Wednesday May 19, 2021
బెల్లంపల్లి, మే 18, ప్రజాపాలన ప్రతినిధి: బెల్లంపల్లి పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో మంగళవారం నాడు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్ లోని ఐసోలేషన్ కేంద్రం వద్ద బ్రెడ్లు, మజ్జిగ పాకేట్లను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా మాలమహానాడు నాయకులు కుసుమ మధుసూదన్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుండి వచ్చిన కరోనా బాధితుల సహాయకులు మరియు స్థానిక యాచకులు లాక్ డౌన్ వల్ల తిండికి ఏమీ దొరకక ఇబ్బందులకు గురవుతున్నారు తెలుసుకుని తమకు తోచిన విధంగా సహాయాన్ని అందిస్తూ మజ్జిగ ప్యాకెట్లు మరియు బ్రెడ్ జాం ప్యాకెట్ లను అందించడం జరిగిందని వారన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుసుమ మధుసూధన్, రాష్ట్ర యువజన అధ్యక్షులు ఆసాది మధు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాలరాజేష్, నాయకులు మారేడి ఉదయ్ కిరణ్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: