రెండు లక్షల రూపాయల చెక్కును అందజేసిన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

Published: Monday January 09, 2023

కొడిమ్యాల, జనవరి 08 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని అప్పారావుపేట గ్రామానికి చెందిన , టిఆర్ఎస్ కార్యకర్త చిరుమల్ల రాజేశం గత కొద్ది నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా మృతుడు రాజేశం టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నుండి రెండు లక్షల రూపాయల చెక్కు రాగా ఆదివారం రోజున చొప్పదండి ఎమ్మెల్యే సుంకె‌ రవిశంకర్ అప్పారావు పేట గ్రామంలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెక్కును అందజేసి ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు.మృతుని కుటుంబ సభ్యులు మాతో కలిసి  భోజనం చేయాలని ఎమ్మెల్యే ను కోరగా వారి కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు పునుగొటి కృష్ణారావు, స్థానిక సర్పంచ్ గరిగంటి‌ మల్లేశం, సింగిల్ విండో చైర్మన్ లు మేనేని రాజనర్సింగారావు,బండ రవింధర్ రెడ్డి, భా రా స మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, భా రా స రాష్ట్ర నాయకులు బందారపు‌ అజయ్ కుమార్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, మరియు ఎంపీటీసీలు,  టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.