ఈనెల 22న నేతకాని మహా ఆత్మీయ సమ్మేళనం

Published: Wednesday January 11, 2023

జన్నారం, జనవరి 10, ప్రజాపాలన: ఈనెల 22న నేతకాని మహా ఆత్మీయ సమ్మేళనం జరుగుతుందని మంగళవారం నేతకాని కుల హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు బోర్లకుంట ప్రభుదాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల కేంద్రంలోని విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ నేతకాని కులస్తుల హక్కుల కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రాలను విడుదల చేశారు. నేతకాని కులస్తులు ఒకటిగా ఉండి పోరాడితేనే హక్కులు సాధించుకోవడానికి ఉద్యమించాలన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగుండం లక్ష్మీ నరసింహ గార్డెన్ ఎన్టిపిసి లో జరిగే సభకు నేతకానిలు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన కోరారు. మంచిర్యాల జిల్లా 18 మండలాలలో నేతకాని కులస్తులు ఉన్నారని వారికి ఎలాంటి గుర్తింపు లేకుండా బతుకుతున్నామన్నారు. నేతకాని కులస్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి రాజేశ్వర్ కాకురా ప్రేమ్సాగర్, కే వెంకటస్వామి, రత్న లక్ష్మణ్, జాడి వెంకట్, రత్నం మాణిక్యం, బండారి సాగర్, జునుగురు లక్ష్మణ్, జాడి గంగాధర్, జాడిశంకర్, జాడి సుధాకర్ బి రాజు వెంకట్, తదితరులు పాల్గొన్నారు.