ఉపాధ్యాయుల కోరత పై డిఇవో వినతి

Published: Thursday August 18, 2022
జన్నారం, ఆగస్టు 17, ప్రజాపాలన: 
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల గ్రామం ప్రాథమిక పాఠశాలలో  ఉపాధ్యాయుల కొరత ఉండడం వలన మంచిర్యాల జిల్లా డిఇవో కు బుధవారం వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కవ్వాల్ సర్పంచ్ రాథోడ్ లక్ష్మి కాలిరామ్ నాయక్, ఇవ్వడం  జరిగిందని  అన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్థానిక గ్రామస్థుల కోరికకు స్పందించి మూడు రోజుల్లో ఉపాధ్యాయులను నియమిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంబాల నర్సయ్య, జానే ఎల్లయ్య, కృపాకర్, అబ్దుల్ సాజిద్, వెంకటేష్ యాదవ్. శేఖర్ తదితరులు పాల్గొన్నారు.