ఆసుపత్రి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

Published: Tuesday June 22, 2021

జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూన్ 21, ప్రజాపాలన : జిల్లా కేంద్రంలోని గోదావరి రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి సుబ్బారాయుడుతో కలిసి ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుండి అనేక మంది రోగులు వైద్య చికిత్స, సేవల నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారని, తాకిడి అధికంగా ఉండటంతో పాటు మరింత మందికి వైద్య సేవలు అందించేందుకు చేపడుతున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అరవింద్, టి.ఎన్.ఎం.ఐ.డి.ఇ. ఈ. ఈ. కుమార్, గుత్తేదారులు,  సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.