మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా మెమోరండం అందజేత

Published: Wednesday December 08, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 7 ప్రజాపాలన ప్రతినిధి : తట్టి అన్నారం గ్రామ సర్వే నెంబర్ 127/2,127/3లో ఎటువంటి మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా నిర్మిస్తున్న అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలతో పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా చేసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ అబ్దుల్లాపూర్ మెట్టు మండల కార్యదర్శి ఏర్పుల నరసింహ మాట్లాడుతూ, గత ఆరు నెలలుగా మున్సిపాలిటీ పర్మిషన్ లేకుండా అక్రమంగా కమర్షియల్ షెడ్లు నిర్మిస్తున్నారని మున్సిపల్ కార్యాలయంలో అనేకసార్లు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ, మున్సిపాలిటీ అధికారులు కమిషనర్ స్థానిక కౌన్సిలర్ లకు భయపడి అక్రమకట్టడాలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే అక్రమ కట్టడాలను కూల్చివేయాలని లేనియెడల గ్రామ ప్రజలతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు గొరెంకల నరసింహ, మండల నాయకులు ముత్యాలు, గ్రామ ప్రజలు మునిందర్ రెడ్డి ఇ సర్వయ్య, కాజా సుధాకర్ గంగమ్మ గణేష్ మల్లయ్య, పాల్గొన్నారు.