లేబర్ కమిషనర్ ముందు జరిగే ధర్నా ను జయప్రదం చేయండి

Published: Monday August 01, 2022
మంచిర్యాల టౌన్, జూలై 31, ప్రజాపాలన:   సిఐటియు ఆధ్వర్యంలో  ఆగస్టు 3న ఛలో హైదరాబాద్,  లేబర్ కమిషనర్ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయలని జిల్లా కేంద్రం లో వాల్ పోస్టర్  ఆవిష్కరించరు. ఈ సందర్భంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల సమస్యల పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, కనీస వేతనాల పెంపుపై 5 రంగాలకు ఇచ్చిన ఫైనల్ నోటిఫికేషన్స్ కు గెజిట్ ఇవ్వాలని, 73 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని, కనీస వేతనం 26 వేలు నిర్ణయించాలని, కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని,  చేపట్టిన ఈ ధర్నా ను జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, రవీందర్, శ్రీనివాస్, సత్యనారాయణ, రాములు, శంకర్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.