పేద ప్రజలకు అండ బీఎల్ఆర్ ట్రస్ట్ బండారి లక్ష్మారెడ్డి

Published: Thursday January 12, 2023
మేడిపల్లి, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి)
పేద ప్రజలకు బీఎల్ఆర్ ట్రస్ట్  ఎల్లప్పుడు అందుబాటులో వుంటుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,
బీఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు.
 సంక్రాతి పర్వదినాన్ని పురస్కరించుకుని రామంతాపూర్ డివిజన్లో బీఎల్ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ 
మహిళలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్విని చేసుకొని వివిధ రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని అన్నారు. మహిళలు పురుషులతో పాటు సమానంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలన్నారు.
బీఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ గౌడ్, చాందు పాష, నరేశ్, శంకర్,అరవింద్, పవన్, హరీష్, ప్రశాంత్, శ్రీను, జాంగిర్, యాకంత్ , మారుతి,మున్న, కిషోర్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.