శ్రీ శ్రీ జగదాంబ మాత సద్గురు సేవాలాల్ మహారాజ్ 15వ వార్షికోత్సవం

Published: Wednesday February 02, 2022
పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్
వికారాబాద్ బ్యూరో 01 ఫిబ్రవరి ప్రజాపాలన : శ్రీ శ్రీ జగదాంబ మాత సద్గురు సేవాలాల్ మహారాజ్ 15 వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నామని శివారెడ్డి పేట్ పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ పుణ్యవచనం నవగ్రహ పూజ ప్రధాన కలశపూజ అభిషేకం నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సిద్దేశ్వర స్వామి శివతేజ స్వామి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి అనంత రెడ్డి పరశురామ్ నాయక్ రాజశేఖర్ రెడ్డి శ్రీకాంత్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.