అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి

Published: Monday September 13, 2021
సేవాలాల్ సేన జాతీయ ప్రధాన కార్యదర్శి రాము నాయక్
బెల్లంపల్లి, సెప్టెంబర్ 12, ప్రజాపాలన ప్రతినిధి : హైదరాబాదులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో అత్యాచారానికి గురై మృతి చెందిన ఆరు సంవత్సరాల గిరిజన బిడ్డ చైత్రను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితున్ని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని సేవాలాల్ సేన జాతీయ ప్రధాన కార్యదర్శి రాము నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు బెల్లంపల్లిలో ఆయన పత్రికల వారితో మాట్లాడుతూ. అభం శుభం తెలియని అమాయక గిరిజన చిన్నారి చైత్రను హత్య చేయడం అమానుషమని, నిందితున్ని కఠినంగా శిక్షించి నప్పుడే బాధిత కుటుంబ సభ్యులకు న్యాయం జరుగుతుందన్నారు. "దిశ" కేసులో జరిగిన న్యాయమే చిన్నారి చైత్ర విషయంలో జరగాలన్నారు, బాధిత కుటుంబ సభ్యులకు డబుల్ బెడ్ రూమ్ తో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము, 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలన్నారు, గిరిజనులపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా అరికట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, హోం శాఖ మంత్రి, డీ జి పి వెంటనే స్పందించి చైత్ర కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.