పట్లూరు గ్రామంలో హనుమాన్ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం

Published: Friday February 03, 2023
* మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవర దేశి అశోక్
వికారాబాద్ బ్యూరో 2 ఫిబ్రవరి ప్రజాపాలన : మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో శ్రీ హనుమాన్ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కి జడ్పీ చైర్ పర్సన్ సునీత రెడ్డికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డికి గురువారం అందజేశామని మర్పల్లి మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవరదేశి అశోక్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. స్వస్తి స్త్రీ శుభకృత్ నామ సంవత్సర మాఘ బహుళ పంచమి 10 ఫిబ్రవరి 20 23 శుక్రవారం నుండి 12 ఫిబ్రవరి 20 23 సప్తమి ఆదివారం వరకు పరివార సహిత ఆంజనేయస్వామి ప్రతిష్ఠాపన మహోత్సవం జరుపబడునని స్పష్టం చేశారు. మాడుగుల నరహరి దీక్షితులు మాడుగుల పురుషోత్తమ శర్మ మాడుగుల సర్వోత్తమ శర్మ సమక్షంలో సపరివార ఆంజనేయస్వామి ప్రతిష్టాపన కార్యక్రమము నిర్వహించబడునని వివరించారు ఈ దివ్య కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి. లక్ష్మి నారాయణ ఎస్. శ్రీశైలం, జి. అశోక్, జి. శంకర్, తొంట రాజు, గొల్లముసలి రాజు తదితరులు పాల్గొన్నారు.