ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పరిరక్షించాలి

Published: Tuesday July 06, 2021
కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి
మేడిపల్లి, జూలై 05 (ప్రజాపాలన ప్రతినిధి) : ప్రతి ఒక్కరూ బాధ్యతగా మూడు మొక్కలు నాటి వాటిని పరిరక్షించుకోవాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 5వ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి 5వ రోజు కార్యక్రమంలో భాగంగా డివిజన్లో కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటా మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం జెసిబితో పిచ్చి మొక్కలను తొలగిస్తూ, చెత్త చెదారం ట్రాక్టర్లతో చేరవేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ, డివిజన్ మహిళా అధ్యక్షురాలు పూర్ణిమ, సతీష్ కుమార్, గంగాధర్, రమేష్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, డివిజన్ సభ్యులు, మహిళలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.