ఘనంగా కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ జన్మదిన వేడుకలు

Published: Saturday November 05, 2022
మేడిపల్లి, నవంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 16వ డివిజన్ కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆయా కాలనీవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ వార్డు సభ్యులు, యువ నేత బండి సతీష్ గౌడ్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ భోగంపాడు సమ్మిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు పలుసం శంకర్ గౌడ్, గణేష్ నగర్ కాలనీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్ గౌడ్, జగన్ మోహన్ రెడ్డి, కోశాధికారి లక్ష్మణ్ గౌడ్, శ్రీపాద ఇంక్లేవ్ అధ్యక్షుడు ఎడవెల్లి రఘు వర్ధన్ రెడ్డి, శ్రీరామ్ ఆర్టీసీ కాలనీ ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి,విష్ణుపురి కాలనీ అధ్యక్షుడు ఉమామహేశ్వర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి పాండు తదితరులు కార్పొరేటర్ బండి రమ్య సతీష్ గౌడ్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి, పుష్పగుచ్చం అందజేసి, కేక్ కట్ చేయించి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు కొల్తూరి భాస్కర్, వేణు, నరసింహ,హారిష్,శ్యామ్ మహిళా నాయకురాళ్లు రజిని, చందన, కళ్యాణి తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు,  పెద్దలు యువత తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.