హోమ్ గార్డ్ పై దాడి చేసిన పరిశ్రమ యాజమాన్యం

Published: Friday June 11, 2021

పటాన్చెరు, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : పారిశ్రామిక వాడా లోని అంబే ఇంటీరియర్ పరిశ్రమ యజమానికి ఓ కేస్ విషయమై సమన్లు ఇవ్వడానికి వచ్చిన బచూపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన హోమ్ గార్డ్ కనకయ్య పై దాడి చేసిన పరిశ్రమ యజమాని దేవి సింగ్ అతని అనుచరులు, ఘటన స్థలానికి చేరుకొని దాడికి పాల్పడ్డ వారిని అదుపులో తీసుకున్న పటాన్చెరు పోలీసులు. కేస్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నమని పటాన్చెరు సి ఐ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బాచుపల్లి హోంగార్డు కనకయ్యపై... నలుగురు వ్యక్తులు దాడి చేశారు. ఓ కేసు విషయంలో దేవీలాల్‌ అనే వ్యక్తికి ఓ కేస్ నోటీస్ ఇవ్వడానికి హోంగార్డు వెళ్లాడు. తాను పోలీసునని చెబుతున్నా వినకుండా... అతని ఐడీ కార్డు, ఫోన్‌ను విసిరికొట్టి... దాడి చేశారు. ఈ విషయంలో హోమ్ గార్డ్ కనకయ్య పిర్యాదు మేరా దేవీలాల్‌తో పాటు దాడికి పాల్పడిన అతని అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని సి ఐ తెలిపారు..