*సర్దార్ నగర్ శివాలయానికి అవినాష్ రెడ్డి రూ.50 వేల విరాళం* *ద్వజ స్ధంభ,నవగ్రహ ప్రతిష్టాపన కర పత
Published: Friday January 27, 2023
*ప్రజాపాలన షాబాద్ ::=షాబాద్ మండల్ సర్దార్ నగర్ గ్రామంలోని శివాలయానికి జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి 50 వేల విరాళం అందించారు.
సర్దార్ నగర్ లో ఈనెల 8 నుండి 12 వరకు శ్రీ భ్రమరాంబ సమేత సంగమేశ్వర స్వామి రామాంజనేయ స్వామి దేవాలయంలో ధ్వజస్తంభం, నవగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు సాగనున్న నేపథ్యంలో గ్రామస్తులతో కలిసి ఆయన గోడ ప్రతి కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా 8న జరిగే ధ్వజ స్తంభ ప్రతిష్టాపనకు గ్రామస్తులు అవినాష్ రెడ్డిని ఆహ్వానించారు. దేవాలయం అభివృద్ధికి సహకరించాలని కోరిన వెంటనే స్పందించిన అవినాష్ రెడ్డి తన వంతుగా 50వేల రూపాయల నగదును అందించారు. అలాగే శివాలయంలో భక్తుల కోసం పది లక్షల నిధులతో మౌలిక సదుపాయాల కల్పన, సిసి రోడ్లను వేయిస్తున్నట్లు వివరించారు. మండలంలోని జీర్ణోద్ధరణ దేవాలయాల అభివృద్ధికి తనవంతుగా సహకరిస్తానని అవినాష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో షాబాద్ సహకార సంఘం అధ్యక్షుడు చల్లా శేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నర్సింగ్ రావు, మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, పెండ్యాల బాలరాజ్,
మాజీ సర్పంచ్ వెంకటయ్య, మా మిడి హరీష్, శశాంక్ రెడ్డి,ఉడుత కుమార్, పాండు, శ్రీశైలం, పండాల శేఖర్, మామిడి అశోక్, కృష్ణాజి, మల్లేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: