ఉపాధి హామీ కూలీలకు నీడ సౌకర్యం ఏర్పాటు చేయాలి

Published: Friday February 17, 2023

జన్నారం,ఫిబ్రవరి 16, ప్రజాపాలన: మండలంలోని ఉపాధి హామీ కూలీలకు పని ప్రదేశం విశ్రాంతి సమయంలో నీడను సౌకర్యం ఏర్పాటు చేయాలని మంచిర్యాల డిఆర్డిఏ పిడి శేషాద్రి అన్నారు. గురువారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. మండలంలోని 29 గ్రామపంచాయతీలలో సర్పంచులు వారి వారి గ్రామంలోని ఉపాధి హామీ పనులను ప్రారంభించ చేయవలసిందిగా ఆయన తెలిపారు. ప్రతి గ్రామపంచాయతీ కుటుంబలలో ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్ అందజేయాలన్నారు. మండలంలోని గ్రామపంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్లు వీలైనంత తొందరలో ఉపాధి హామీ పనులను అందరికీ కల్పించాలని ఆయన సూచించారు. కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ రవీందర్ సర్పంచ్ జాడిగంగాధర్ కూలీలు పాల్గొన్నారు.