బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

Published: Wednesday December 14, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి
 ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో  సాయి భోజన్ నిర్వహించారు. 
 బెల్లంపల్లి కమ్యూనిటీ వైద్యశాలలో ట్రస్టు దాతలుచెరుకువాటి సాయి రామదాసు, నెక్కంటి యశ్వంత్,లు మంగళవారం మధ్యాహ్నం గర్భిణులు, బాలింతలకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్-రాజేశ్వరి తెలిపారు. 
ప్రతి మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో  గర్భిణులకు, రోగులకు,  సాయి భోజన్ అన్నదానం చేస్తున్నామని, ఇందులో భాగంగా మంగళవారం  సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. 
ఈ సందర్భంగా ఆస్పత్రిలోని, స్థానిక కార్మికులు, గర్భిణీలు, సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకుని, అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ, బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.