రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పనిచేశా రాజగోపాల్ రెడ్డి గెలుపుకై కృషి చేస్తా -- బక్క స్వప్న

Published: Wednesday September 28, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి): మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో పనిచేశానని రాజగోపాల్ రెడ్డి గెలుపుకై కృషి చేస్తానని చిన్న కొండూరు గ్రామ సర్పంచ్ బక్క స్వప్న శ్రీనాథ్ అన్నారు. మంగళవారం ప్రజాపాలన దినపత్రిక పలకరిస్తే వారు మాట్లాడుతూ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చిన్న కొండూరు గ్రామంలో అహర్నిశలు పనిచేశానని గ్రామంలో సర్పంచ్ గా ఎన్నిక కాబడ్డానని అన్నారు. మునుగోడు ప్రజల కోసం, మునుగోడు ఆత్మగౌరవం కోసం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి రాష్ట్రంలో నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వానికి అంతమొందించాలంటే కేవలం బిజెపి పార్టీ తోనే సాధ్యపడుతుందని బిజెపిలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ఇస్తూ  బిజెపి పార్టీలో చేరానన్నారు. కానీ నాపై గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత మహిళను అని చూడకుండా నాపై కక్ష సాధింపు తో దుర్భాషలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్నారని కెసిఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు అధిక సంఖ్యలో భాజపా పార్టీలో చేరుతున్నారని అన్నారు. మునుగోడు గడ్డపై కాషాయపు జెండా ఎగురుతుందని కెసిఆర్ గడీల రాజ్యం కూలడానికి రాజగోపాల్ రెడ్డి గెలుపుతో ప్రారంభం పలుకుతున్నామన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయానికై ఒక సైనికుడిలా పని చేస్తానన్నారు.