తాడికల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శంకరపట్నం నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి:

Published: Monday November 14, 2022

శంకరపట్నం మండలం తాడికల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006 _2007 సంవత్సరం లో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 15 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా వారు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాడికల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి మాట్లాడుతూ  చదువుతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ  అవసరమని విద్యార్థులు ఏ స్థాయిలోనైనా  ఏ రంగాల్లో ఉన్న ఆప్యాయతనురాగాలతో పాటు ఆత్మీయ సమ్మేళనం అనేధి ప్రతి ఒక్కరిలో అలవాటు గా ఉండాలనీ ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో 2006_ 2007 సంవత్సరంలో బోధించిన  అధ్యాపకులు సదానందం.శంకరయ్య.భాస్కర్.రాంప్రసాద్.పుల్లారెడ్డి.అశోక్ .ప్రవీణ్ పాల్గొని అప్పటి తీపి జ్ఞాపకాలను పూర్వ విద్యార్థులతో కలిసి పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ఎండి అజీముద్దీన్.రౌతు అనిల్ .ఎండి అబీబ్, కూరపాటి మారుతి .అనగోని బాలాజీ .బత్తిని అనిల్ .జక్కి అశోక్ .సముద్రాల సతీష్.ఇజ్జగిరి రమేష్.ఏనుగుల రాజ్ కుమార్ .మర్రి రాజు .గడ్డి రమేష్.ఆడెపు రాజ్ కుమార్.దుబ్బాక మహేష్ .సతీష్.మానస రేష్మ .కృష్ణవేణి .మనీషా .రూమా .భాగ్యలక్ష్మి.లావణ్య తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.