ఘనంగా శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి ఏకాదశ రుద్రాభిషేకం
Published: Tuesday March 16, 2021
సారంగాపూర్, మార్చి 15 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలం పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పార్వతీదేవి సమేత దుబ్బరాజేశ్వర స్వామి ఏకాదశ రుద్రాభిషేకం సోమవారం రోజున ఉదయం 10 గం 30 ని: లకు అర్చకులు మంత్రోచ్చరణాలతో ఘనంగా నిర్వహించారు. ఏకారుద్రాభిషేకంలో పాల్గోన్న గ్రామస్తులు భక్తులు నాయకులు ధర్మకర్తలు అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ జడ్పీటిసి మేడిపల్లి మనోహర్ రెడ్డి ఆలయ ట్రస్ట్ పౌండర్ పోరండ్ల శంకరయ్య ఈఓ కాంతారెడ్డి సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న ఆకుల జమున పల్లికొండ రమేష్ స్థానిక నాయకులు తదితరులు హాజరయ్యారు.
Share this on your social network: