సాయి కృప నగర్ లో పట్టభద్రుల కొరకు ప్రచారం

Published: Tuesday March 09, 2021
బాలాపూర్ :ప్రజాపాలన న్యూస్; మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 16 వ వార్డు డివిజన్ లోని శ్రీ సాయి కృపా నగర్ కాలనీ లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల నియోజకవర్గం పట్టభద్రుల MLC అభ్యర్థి సురభి వాణి దేవి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయమని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పోరేటర్ ఎనుగుల అనిల్ కుమార్ యాదవ్, శ్రీ సాయి కృపా నగర్ కాలనీ అధ్యక్షులు మేకల యాదగిరి, ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, 16 వ డివిజన్ ఇంచార్జిలు రమణ రాజు, సూదీప్ యాదవ్ లు కలిసి  ప్రచారం చేయడం జరిగింది ఒటరుల నుండి మంచి స్పందన వచ్చిందినీ అన్నారు.