గంగారంలోని 3.5 ఎకరాల వేలం ఆదాయం 3.71కోట్లు
Published: Tuesday November 15, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో 14 నవంబర్ ప్రజా పాలన : సోమవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయంలో వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారంలో గల రాజీవ్ స్వగృహ ఓపెన్ స్థలం 3.5 ఎకరాలకు పారదర్శకంగా బహిరంగ వేలం వేసి విక్రయించామని జిల్లా కలెక్టర్ నిఖిల తెలిపారు. హైదరాబాద్ కు చెందిన "జాయ్ వెంచర్స్" వారు అత్యధికంగా ఎకరానికి ఒక కోటి ఆరు లక్షల రూపాయలకు పాట పాడి 3.5 ఎకరాల భూమిని చేజిక్కించుకున్నారని తెలియజేశారు. బహిరంగ వేలంలో మొత్తం 40 మంది ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. అనంతరం స్థలాన్ని చేజిక్కించుకున్న జాయ్ వెంచర్స్ వారికి జిల్లా కలెక్టర్ నిఖిల, జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మలు ధ్రువ పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ విజయకుమారి, రాజీవ్ స్వగృహ జనరల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, టిఎస్ఐఐసి జోనల్ మేనేజర్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: