మాజీసర్పంచ్ బాదావత్ భిక్షంనాయక్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి

Published: Friday May 27, 2022
పాలేరు మే 26 ప్రజాపాలన ప్రతినిధి
కూసుమంచి మండలం మల్లాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హట్యాతండ గ్రామం లో మాజీ సర్పంచ్ బాదవత్ బిక్షం నాయక్ ప్రధమ వర్ధంతి వేడుక లో డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్  పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిక్షం నాయక్ గారి సేవలు మరువలేనివి అని ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అని, గిరిజనుల కోసం ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో  కూసుమంచి మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, మద్దులపల్లి మార్కేట్ కమిటీ చైర్మన్ మల్లీడు అరుణ వెంకన్న, MPTC సభ్యులు జర్పుల బాలాజీ,బాదావత్ వెంకన్న, కూసుమంచి మండల SC సెల్ అధ్యక్షుడు గోపె రాము, కూసుమంచి మండల టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన శ్రీనివాస్, కోక్కిరేణి రమేష్,సాయికుమార్, సైదులు తదితరులుపాల్గొన్నారు