*పిర్ టీ యు తో ఉపాధ్యాయుల పరిస్కారం* -ఇంటింటా ప్రచార కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్

Published: Saturday February 25, 2023

చేవెళ్ల ఫిబ్రవరి 24,(ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో  ఇంటింటి ప్రచార కార్యక్రమం లో భాగంగా రంగారెడ్డి  జిల్లా అధ్యక్షులు కన్నయ్య గారి గోవర్ధన్ యాదవ్ గారు చేవెళ్ల మండల కేంద్రము లో ఉపాధ్యాయులను కలిసి పి ఆర్ టి యు టి ఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు . సమస్యల సాధనలో పి ఆర్ టి యు  సంఘం ముందుంటుంది, సంఘం సాధించిన విజయాలు, సాధించాల్సిన విషయాలు తెలియజేశారు. పి ఆర్ టి యు టి ఎస్ సంఘం బలపరిచిన అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలుపు లో భాగస్వాములు కావాలని కోరారు. ఉపాధ్యాయుల శ్రేయస్సే పి ఆర్ టి యు లక్ష్యం, ప్రాథమిక సభ్యుల క్షేమమే పి ఆర్ టి యు ధ్యేయం అని అన్నారు . ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల అధ్యక్షులు సత్యయ్య గౌడ్,.       ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మొయినాబాద్ మండల అధ్యక్షులు బందయ్య, షాబాద్ మండల ప్రధాన కార్యదర్శి క్రిష్ణ, రాంచెందర్,నర్సింలు, రాంచెందర్, ఆనంద్,తిరుమలేశ్, శ్రీశైలం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు .🙏