రామాజీపేట గ్రామంలో గంగమ్మతల్లికి బోనాలు సమర్పించిన భక్తులు

Published: Thursday June 09, 2022

రాయికల్, జూన్ 08 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ మండలం రామాజీపేట్ గ్రామంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో భక్తులు మరియు గంగపుత్రుల మహిళలు ఇంటికొక బోనం చొప్పున డప్పు, సన్నాయివాయిద్యాల చప్పుళ్ళతో చిన్నారుల కేరింతలతో, ఆటపాటలతో, బృంద న్రృత్యాలతో, భక్తులు తలపై బోనాలు పెట్టుకొని ఊరేగింపుగా వెళ్లి గంగమ్మతల్లికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు, గంగపుత్రుల సంఘం, తదితరులు పాల్గొన్నారు.