కార్తీక మాసం దీప కాంతులు జీవితాల్లో వెలుగులు నింపాలి
Published: Wednesday November 09, 2022
* 31వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రీ లక్ష్మణ్
వికారాబాద్ బ్యూరో 8 నవంబర్ ప్రజాపాలన : పవిత్రమైన కార్తీక మాసంలో వెలిగించిన దీపకాంతులు ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని 31వ వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రీ లక్ష్మణ్ ఆకాంక్షించారు. మంగళవారం ఉదయం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో మాలె గాయత్రీ లక్ష్మణ్ దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజాకైంకర్యాలు నిర్వహించారు. అనంతరం కార్తీక మాసం దీపాలను వెలిగించారు. మాలె గాయత్రీ లక్ష్మణ్ కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో మహా ప్రసాద వితరణ కార్యక్రమాన్ని గత ఆరు సంవత్సరముల నుండి కొనసాగించడం విశేషం. భక్తుల కొంగుబంగారంగా వెలసిన శ్రీ అనంతపద్మనాభ స్వామిని కొల్చిన వారికి కొండంత అండగా ఉంటాడు. భక్తి ప్రపత్తులతో స్వామివారిని వేడుకుంటే కోరిన కోరికలను తీర్చే మార్గ నిర్దేశకుడు అనంత పద్మనాభుడు. ప్రజలందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
Share this on your social network: