పని చేసే సత్తా పల్లా రాజేశ్వర్ రెడ్డి కే ఉంది.

Published: Saturday March 06, 2021
పల్లా రాజేశ్వర్ రెడ్డి సతీమణి నీలిమ
మదిరలో ముమ్మరంగా పల్లా రాజేశ్వర్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ  ప్రచారం.
ప్రచారంలో పాల్గొన్న వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి.
మధిర మార్చి 05 ప్రజాపాలన ప్రతినిధి: పట్టభద్రుల సమస్యలపై పనిచేసే సత్తా పల్లా రాజేశ్వర్ రెడ్డి కి కి ఉందని వారి సతీమణి నీలిమ పేర్కొన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సై ఉదయ్ కుమార్ నీ వారి సిబ్బంది, ప్రజా పాలన విలేకరులను పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావుమరియు అదేవిధంగా మధిర తాసిల్దార్వాలయం సైదులు లుఈవో సత్యనారాయణ ను ఓట్లు అభ్యర్థించారు. మధిర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు మొదలగు వారిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి డి విజయాన్ని కాంక్షిస్తూ వారి సతీమణి నీలిమ ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రుల సమస్యలు, నిరుద్యోగ సంస్థలపై మాట్లాడే సత్తా.. చొరవ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికె ఉందని పేర్కొన్నారు. మీ అమూల్యమైన ఓటును పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికి మొదటి (1)ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి టిఆర్ఎస్ పట్టణ బాద్యులు కనుమూరి వెంకటేశ్వరరావు, సుశీల విద్యాసంస్థల అధినేత కరివేద వెంకటేశ్వరరావు భరత్ విద్యాసంస్థల అధినేత శీలం వెంకట రెడ్డి, మధిర మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, ఎంపీపీ లలిత వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత టిఆర్ఎస్ నాయకులు చుంచు విజయ్, ఎర్రగుంట రమేష్ జేవీ రెడ్డి గొబ్బిళ్ళ పాట బాబురావు వార్డు కౌన్సిలర్లు మాధవి ఎర్రగుంట లక్ష్మి మాధురి కళ్యాణి టిఆర్ఎస్ మహిళా నాయకురాలు భోగ్యం ఇందిరా తదితరులు పాల్గొన్నారు.