రామంతాపూర్ రెడ్డి సంఘం కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కరోనాతో మృతి

Published: Tuesday May 04, 2021
మేడిపల్లి, మే3 (ప్రజాపాలన ప్రతినిధి) : రామంతాపూర్ రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయ కార్యదర్శి ముదినోళ్ళ శ్రీనివాస్ రెడ్డి (65) కరోనాతో మృతి చెందినట్లు సంఘం ప్రతినిధి పసుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు.రామంతాపూర్ అరవింద నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాస్ రెడ్డికి గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ సోకడంతో ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు రెడ్డి సంక్షేమ సంఘం ప్రతినిధి పసుల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. శ్రీనివాస్ రెడ్డికి కుమారుడు, కూతురు ఉన్నట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, ముఖాలకు మాస్కులు, సామాజిక దూరం పాటిస్తూ, బయటకు రాకుండా ఇంట్లోనే ఉండడం శ్రీరామరక్ష అని ప్రభాకర్ రెడ్డి సూచించారు.