అభివృద్ధి పనులను పర్యవేక్షించిన కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు
Published: Tuesday January 24, 2023
మేడిపల్లి, జనవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సోమవారం స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్రావు పర్యవేక్షించారు. డివిజన్లోని వివేక్ నగర్ కమ్యూనిటీ హాల్లో జరుగుతున్న పనులను మరియు రామంతాపూర్ రజక సేవా సంఘంలో గల డ్రైన్ స్లాబ్ లను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకటరావు, సంకూరి కుమారస్వామి, కందకట్ల దయానంద రెడ్డి, రజక సేవా సంఘం అధ్యక్షులు బొడ్డుపల్లి లింగమయ్య, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి దానయ్య, బాలకృష్ణ, జిహెచ్ఎంసి మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: