ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Published: Tuesday September 27, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్లోని శ్రీ సాయి నగర్, విహారిక సి సెక్టార్, సాయి నగర్ హిల్స్ మరియు క్రాంతి కాలనీలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో  స్థానిక కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా ఆట, పాటలతో  జరుపుకోన్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో డివిజన్లోని కాలనీల అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్ చారి,అశోక్ రెడ్డి, సత్యనారాయణ,ముత్యాలు,రాజ్ కుమార్ నాయక్,హరిందర్ యాదవ్ మధు మోహన్ రెడ్డి, మరియు కాలనీల అసోసియేషన్ సభ్యులు మహిళలు పెద్దలు యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.