మండవ కృష్ణారావు గారి ఆకస్మిక మృతికి స్విమ్మర్స్ అషోషియేషన్ తరుపున ఘన నివాళి

Published: Friday August 06, 2021

మధిర, ఆగస్టు 05, ప్రజాపాలన ప్రతినిధి : స్నేహశీలి, మృదుస్వభావి, ప్రముఖ సిపిఎం నాయకులు మరియు మా స్విమ్మర్స్ కుటుంబానికి పెద్దదిక్కు అయిన మండవ కృష్ణా రావు ఈ రోజు ఆకస్మికంగా పరమపదించినారు. స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సిరెడ్డి అధ్వర్యంలో స్విమ్మర్ సభ్యులు అందరూ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణారావు గారి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని, మధిర మండల పరిసర ప్రాంత ప్రజలు ఒక మంచి నాయకుడిని కోల్పోయారని తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో స్విమ్మర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చల్లా సత్యనారయణ, చెరుకూరి కృష్ణారావు, నల్లమల గోపి, చౌదరయ్య, వెలివెల శ్రీధర్, కొలగాని ప్రసాద్, పావులూరి వెంకటేశ్వరరావు, రాము & శ్యామ్, ఉపేంద్ర, హనుమ, చెరుకూరి శ్రీను, మురళి కృష్ణ, రాంబాబు, అప్పారావు, కోటేశ్వరరావు, ఆదాము, సైదులు మరియు తదితరులు పాల్గొన్నారు.